
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 11 December 2015
వైద్యనాథ లింగం:
వైద్యనాథ లింగం:
జ్యోతిర్లింగంగా చెప్పబడే వైద్యనాథలింగం బీహార్ రాష్ట్రంలోని చితాభూమిలో ఉన్నదని ఉత్తరాదివారు భవిస్తారు. వారి దృష్టిలో మహారాష్ట్రలోని పర్లివైద్యనాథలింగం జ్యోతిర్లింగం కాదు. కానీ దక్షిణాదివారు మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ క్షేత్రాన్నే జ్యోతిర్లింగ క్షేత్రంగా చెబుతారు. ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నదిగా చెప్పబడినప్పటికి దానికి సంబంధించిన పురాణగాథ ఒక్కటే.
* యాత్రామార్గం:
ఔరంగాబాద్ నుంచి 12 గం|| ల కాలం బస్సులో ప్రయాణించి పర్లివైద్యనాథ క్షేత్రాన్ని చేరవచ్చు. లేదా పర్భిణి రైల్వేజంక్షన్ నుంచి 40 కి.మీ. దూరం రైలులో ప్రయాణించి పర్లివైద్యనాథ్ క్షేత్రంలో దిగవచ్చు.
* పురాణగాథ:
శివభక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు వెండికొండకు పోయి శివుని ప్రీతికోసం తన తలలను హోమంచేసి 9 తలలను హోమంలో వేసిన తరువాత 10వ తలను కూడా ఖండిచబోగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఇతరులు తన తలలను ఖండించినప్పుడు అవి వెంటనే మరల మొలచి యథాస్థితిగా ఉండాలని, శివుడు తన లంకారాజ్యానికి వచ్చి అక్కడే స్థిరంగా ఉండాలని వరం కోరాడు. అందుకు శివుడు అలాగే అంటూ తన బదులు ఆత్మలింగాన్ని ఇస్తున్నానని, దానిని తీసుకొనిపోయి లంకారాజ్యంలో ఉంచమని అది లంకలో ఉన్నంతకాలం రావణునికి అపజయం అన్నది లేక రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాజ్యానికి ఎటువంటి పతనావస్థా ఉండదని చెప్పాడు. కానీ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేలోపు మరెక్కడా క్రిందపెట్టకూడదని, నేలపై పెట్టిన తరువాత దానిని పెకలించటం ఎవరికీ సాధ్యంకాదని కూడా శివుడు చెప్పాడు.
దానికి అంగీకరించిన రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని మధ్య దారిలో సంధ్యా వందనానికి సమయం కాగా ఆ సమయానికి కనిపించిన ఒక బాలుని చేతిలో ఆ లింగాన్ని ఉంచి వెంటనే తిరిగి వస్తాననీ, అప్పటివరకు క్రింద పెట్టికుండా జగ్రత్తగా పట్టుకోవలసినదిగాను చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు.
శివుడు ఆత్మలింగం లంకకు చేరినందువల్ల దేవతలకు కష్టములు నాలుగింతలు అవుతాయని ఊహించిన దేవతలు నారదుని సలహామేరకు గణాధిపతి అయిన వినాయకుని ఆత్మలింగం లంకకు చేరకుండా చూడమని ప్రార్థించినట్లుగానీ, వినాయకుడే పిల్లవాని రూపంలో తనకు కనిపించాడని గానీ రావణాసురునికి తెలయదు.
సంధ్యావందనానికి వెళ్ళిన రావణుడు 48 ని||ల కాలంవరకు రాలేదు. పనిపూర్తి చేసుకొని తిరిగివస్తున్న రావణుని చూడగానే ఆ పిల్లవాడు ” రావణా ! ఈ లింగాన్ని ఇంక మోయలేను ” అని గట్టిగా అరుస్తూ ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టివేశాడు. పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగంపైకి రాలేదు సరికదా అతని శరీరమంతా గాయాలయ్యాయి. అపుడు శివుడు ప్రత్యక్షమై అతని గాయాలను మానపి ఇక ఆ లింగం కదలదని కనుక రావణసురునే ప్రతిరోజు వచ్చి ఆ లింగాన్ని సేవించుకోవలసినదిగాను ఉపదేశించి అదృశ్యమయ్యాడు.
రావణాసురునికి వైద్యం చేసి గాయాలను మానపినందువల్ల స్వామికి వైద్యనాథుడని పేరు వచ్చింది. ఈ సందర్భంగా రావణాసురుడు చేసిన శివతాండవ స్తోత్రం ఎంతో పేరు పొందింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment