
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 4 June 2015
మన ఋషులు చెప్పిన కొన్ని కలియుగ లక్షణాలు
"కలికాలమున రోజురోజుకు సత్యము,ధర్మము,దయ,క్షమ,ఆయువు మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి.
ధనవంతుడే ఆచారవంతుడు,గుణవంతుడు,ధర్మపరుడు,న్యాయపరుడు మరియు సర్వనియంత అవుతాడు.( ప్రస్తుతం ధనమున్న అమెరికా దేశం ఇలా ఉంది.)
పెండ్లిండ్లలో కులం,శీలము,యోగ్యత చూడరు. ప్రేమవివాహాలు యువతీయువకులు తమకు నచ్చిన వారినే వివాహమాడతారు(ప్రేమవివాహాలు) .కాని ఆ ప్రేమలలో నిజాయితీపాలు చాలా తక్కువగా ఉంటుంది.
మోసం చేయగలవారు ,అబద్దాలు చెప్పువారు వ్యవహారదక్షులు అవుతారు.
బ్రాహ్మణత్వం బ్రహ్మజ్ఞానంచేకాక జందెము వలన వ్యక్తము అవుతుంది.( బ్రాహ్మణుడు అంటే ఎవరనేది ఇంత స్పష్టముగా చెప్పినా ఈ విషయంపై మనవారి వాదాలకు అంతులేకుండాపోయింది ).
వాగినవాడు పండితుడు , మంచిగా ఉండకపోవడమే మంచితనము, కలిసిఉండడమే పెళ్ళిగా పరిగణింపబడతాయి.
దూరముగా ఉన్న మురికిగుంటయే పుణ్యతీర్థముగా,వెంట్రుకలు పెంచుకొనుట అందముగా, కడుపు
నింపుకొనుట పురుషార్థముగా, కుటుంబపోషణే ఘనకార్యముగా, కీర్తిని కోరుకొనుటే ధర్మాచరణగా
పరిగణిస్తారు.
"కలౌ వేంకటనాయకః" అంటే కలియుగానికి శ్రీవేంకటేశ్వరస్వామియే భగవంతుడు.ఈ విషయం ఎంత అక్షరసత్యమో మనకు తెలియంది కాదు.
"సంఘేశక్తిః కలియుగౌ" అంటే కలియుగంలో సంఘ శక్తిదే కాలం."
ఇదండీ మన ఋషులు చెప్పిన కొన్ని లక్షణాలు.ఇంకా చాలా ఉన్నాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment