
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 9 March 2015
వసంత వైభవం
వసంత వైభవం
వసంతకాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. మల్లెల సుగంధం ప్రతి మనసునీ మత్తెక్కిస్తుంది. కోకిల పాటలు అలౌకిక ఆనందాన్నిస్తాయి. వసంతకాలంలో పుష్పాలలో ‘మధువు’ (తేనె) ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాసాన్ని మధుమాసం అంటారు. కాళిదాసు రచించిన రుతుసంహార కావ్యంలో మధుమాస శోభ అనంతంగా కనిపిస్తుంది. వసంత మాసానికి సురభి అనే పేరు ఉందని అమరకోశం చెబుతోంది. సురభి అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం.
అంటే.. వసంతమాసం ప్రజలు కోరుకున్న కోరికలను సిద్ధింపజేస్తుందని అన్వయించుకోవచ్చు. ‘రుతూనాం ముఖో వసంతః’ అని తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉంది. రుతువులన్నింటిలోనూ వసంతరుతువుదే అగ్రస్థానం అని దీని భావం. ‘వసతి కామోస్మిన్నితి’ - అంటే వసంత రుతువులో కామప్రకోపం ఎక్కువగా ఉంటుందని అర్థం. దాంపత్య సౌఖ్యానికి ఈ రుతువు అనుకూలం. ఇలా మానవగమనంలోని ప్రతి అడుగుకీ ‘వసంతం’ ఒక ప్రాతిపదిక కల్పిస్తుంది. మానవ జీవన వికాసానికి పునాదిగా నిలుస్తుంది.
వసంత నవరాత్రులు
హైందవ ఆధ్యాత్మిక వ్యవస్థలో నవరాత్రులకు విశేషమైన స్థానం ఉంది. ఇందులో గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు బాగా ప్రసిద్ధి పొందాయి. కానీ, వీటికన్నా ముందుగా ఉగాది ప్రారంభం నుంచి వసంత నవరాత్రులు జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. చైత్రశుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచి చైత్ర శుద్ధ నవమి (శ్రీరామనవమి) వరకు తొమ్మిది రోజుల కాలాన్ని వసంత నవరాత్రులుగా వ్యవహరిస్తారు. దేవీభాగవతం, ధర్మసింధువు తదితర గ్రంథాల్లో వీటి ప్రాశస్త్యాన్ని ఎంతగానో వివరించారు.
చైత్ర మాసం సంధికాలం. శీతలం నుంచి ఉష్ణానికి వాతావరణం మారుతుంది. ఈ మార్పులవల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వీటి నుంచి ప్రజలను రక్షించడానికి వసంత నవరాత్రులనే పేరుతో పూర్వీకులు కొన్ని నియమాలను విధించారు. ఉగాది రోజున కలశస్థాపన చేసి, విధివిధానంగా అర్చన, మంటపారాధన చేయాలి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను, శ్రీరామచంద్రమూర్తిని అర్చించాలి.
ఈ పద్ధతులన్నింటిలో అంతర్లీనంగా ఆరోగ్యసంరక్షణ దాగి ఉంది. భగవతత్త్వానికి ‘పర’, ‘అపర’ అనే రెండు ప్రకృతులు ఉన్నాయి. ఒకటి అచేతనం కాగా మరొకటి చేతనం. బాహ్యంగా కనిపించే పంచభూతాలు; అహంకారం, బుద్ధి, వ్యక్తం అనే ఎనిమిదికి (అపరా ప్రకృతి) పరాప్రకృతి కలిపితే మొత్తం తొమ్మిది అంశాలు అవుతాయి. ఈ తొమ్మిది అంశీభూతాలను తొమ్మిది రోజులపాటు ‘వసంత నవరాత్రులు’గా అర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఆధ్యాత్మిక రహస్యం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment