శివ పార్వతీ నందనుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఆయనజననం లోకరక్షణ కొరకే. లోకోద్ధరణ కోసం పుట్టిన ఆ సుబ్రహ్మణ్య స్వామికి అనేక పేర్లు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి కుమారా స్వామి, దండాయుధ పాణి, షణ్ముఖుడు. తమిళులైతే ఈయనను ఆర్ముగం అనీ, మురుగన్ అనీ అంటారు. తమిళనాట ఉన్న ఒక కథనం ప్రకారం దానవులు లోక కంటకులుగా మారిపోవటంతో శివుడు కోపోద్రిక్తుడయ్యాడు. అప్పదు ఆయన మూడవ నేత్రం నుంచి ఆరు అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. వాటిలో నుంచి ఉద్భవించిన వాడే సుబ్రహ్మణ్య స్వామి. ఈయన అసామాన్య పరాక్రమవంతుడు. దేవా సైన్యాధిపతి. దానవ సంహారి. దక్షిణ భారత దేశంలో ఉన్న ఒక నానుడి ప్రకారం ప్రపంచంలో ఎక్కడెక్కడ కొండ ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి తప్పని సరిగా ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనవి తమిళనాడులో ఉన్న ఆరు దేవాలయాలు. ఈ ఆరింటినీ కలిపి 'షట్ రణ శిబిరాలు' (six battle camps)అని అంటారు. అవి: 1. పళని 2. పళముదిర్ కోలయ్ 3. స్వామి మలయ్ 4. తిరుత్తణి 5. తిరుపరంకుండ్రం 6. తిరుచెందూర్

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment